E-Paper
Advertisement

Father Kills Daughter : అనుమానంతో ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి.. మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా

Father Kills Daughter : అనుమానంతో ఆరేళ్ల కూతుర్ని చంపిన తండ్రి.. మిస్సింగ్ కేసు పెట్టి డ్రామా
Advertisement

Father Killed Daughter in Narpala : ఆడపిల్లలకు ఇంటి బయటే కాదు. సొంతింట్లోనూ రక్షణ ఉండటం లేదు. అన్నదమ్ములు, బాబాయ్, తాతయ్య, మామయ్య.. ఇలా ఇంట్లో అంతా అయినవారే ఉన్నా.. ఎందుకో ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. కామంతో కొందరు కాటేస్తుంటే.. భార్యలపై అనుమానాలతో పిల్లల్ని పొట్టనబెట్టుకుంటున్నారు ఇంకొందరు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కూతురికి ఏ కష్టమొచ్చినా.. నేనున్నా అని ధైర్యం చెప్పాల్సిన తండ్రే.. ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు.

నిండు నూరేళ్లు ఏ ఆపద రాకుండా చూసుకుంటాడనుకున్న తండ్రే..ఆ కూతురి పాలిట మృత్యువుగా మారాడు. ఆ పసి జీవితాన్ని ఆదిలోనే అంతం చేశాడు. అనంతపురం జిల్లా నార్పలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి.. బావిలో పడేసాడు తండ్రి గణేష్. ఆ తర్వాత కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 20వ తేదీ సాయంత్రం నుంచి కూతురు కనిపించడం లేదని నార్పల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగి గాలించారు. ఎక్కడా పాప ఆచూకీ లభించలేదు.

Advertisement

Also Read : దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి..

చివరికి తమదైన శైలిలో విచారణ చేయగా కన్నతండ్రే పాపను హత్య చేసి బావిలో పడేసినట్లు తేల్చారు. బావిలో నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న స్థానికులు బావి వద్దకు చేరుకున్నారు తల్లి బంధువులు. చిన్నారి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారిని కన్న తండ్రి పొట్టనపెట్టుకున్నాడంటూ వాపోయారు.

Advertisement

కాగా.. భార్యపై అనుమానంతోనే గణేష్ తన కూతురిని చంపినట్లుగా పోలీసులు తెలిపారు. తన భార్యపై అనుమానంతోనే కూతురి గొంతు నులిమి చంపి.. బావిలో పడేసినట్లు అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు. గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×