E-Paper
Advertisement

Kadapa District: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?

Kadapa District: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?

Kadapa District: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయలో పడిపోయింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బుధవారం ఉదయం కదిరి నుంచి కడప జిల్లా(Kadapa District) పులివెందులకు ఆర్టీసీ బస్సు బయలు దేరింది. పులివెందుల సమీపంలోకి బస్సు వచ్చింది. అయితే డంపింగ్ యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.

వేగానికి బస్సు ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. తొలుత చెట్టును ఢీ కొని 30 అడుగు లోయలో పడిపోయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగారు అధికారులు.

బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారు కోలుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలుసుకోగానే టీడీపీ నేతలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాని డాక్టర్లకు సూచించారు.

ALSO READ: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఘటన జరిగిన తీరుని డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. అలాగే ప్రయాణికుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ ఘటన వెనుక తప్పు ఎవరిది? అనేది తేలాల్చివుంది.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×