E-Paper
Advertisement

Nagar Kurnool District: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..

Nagar Kurnool District: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..

Nagar Kurnool District: న్యూ ఇయర్ వేళ అందరూ సంబరాల్లో మునిగిపోతుంటే, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో మాత్రం తీవ్ర విషాదం అలుముకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భీమశెట్టి ప్రసన్న (35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి ఇచ్చి, తాను కూడా తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనలో తల్లి ప్రసన్నతో పాటు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె మేఘన అక్కడికక్కడే మృతి చెందగా, పదో తరగతి చదువుతున్న కుమారుడు అశ్వితరామ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

అయితే సుమారు రెండు నెలల క్రితం ప్రసన్న భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటి నుంచి ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురై, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటోంది. చేతికి అందొచ్చిన బిడ్డలు ఉన్నప్పటికీ, భర్త లేని జీవితం తనకు భారంగా అనిపించిందని, ఆయన లేని లోకంలో తాను ఉండలేననే ఆవేదనతోనే ఆమె ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

సంఘటన జరిగిన సమయంలో పిల్లలు ఇద్దరూ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకల రోజునే ఈ ఘాతుకం జరగడం అందరినీ కలిచివేసింది. అశ్వితరామ్ పరిస్థితిని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి, సోదరిని కోల్పోయి అనాథగా మిగిలిన ఆ బాలుడి పరిస్థితి చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన

సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా లేక కేవలం మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో తిలక్ నగర్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×