E-Paper
Advertisement

Mancherial: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన

Mancherial: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన
Advertisement
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి ప్రయాణం చేశాడు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రెండు బోగీల మధ్య ఉండే ‘కప్లింగ్’ పై ప్రమాదకర రీతిలో కూర్చుని ఆ వ్యక్తి ప్రయాణించాడు. కదిలే రైలులో ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా అతను చేసిన ఈ సాహసం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

అయితే రైలు మంచిర్యాల స్టేషన్‌కు చేరుకున్న సమయంలో, బోగీల మధ్యలో ఏదో కదలిక ఉండటాన్ని గమనించిన RPF, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చని భావించి, రైలును నిలిపివేసిన అనంతరం అతడిని సురక్షితంగా కిందికి దించారు. నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ఆ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలపై పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అతని మాటల్లో స్పష్టత లేకపోవడంతో, అతనికి మానసిక స్థితి సరిగా లేదా లేక ఏదైనా ఇతర కారణాలతో ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం అతని చిరునామాను సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ!

ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ఇలాంటి సాహసాలు చేసి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. రైలు లోపల కాకుండా బయట భాగాల్లో, ఫుట్‌బోర్డులపై లేదా బోగీల మధ్య ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల కేవలం ఒకరి ప్రాణమే కాకుండా రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×