అయితే రైలు మంచిర్యాల స్టేషన్కు చేరుకున్న సమయంలో, బోగీల మధ్యలో ఏదో కదలిక ఉండటాన్ని గమనించిన RPF, స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చని భావించి, రైలును నిలిపివేసిన అనంతరం అతడిని సురక్షితంగా కిందికి దించారు. నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాలపై పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అతని మాటల్లో స్పష్టత లేకపోవడంతో, అతనికి మానసిక స్థితి సరిగా లేదా లేక ఏదైనా ఇతర కారణాలతో ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం అతని చిరునామాను సేకరిస్తున్నారు.
Also Read: తరగని భక్తి.. చెరగని రికార్డు.. తిరుమలలో సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రసాదం పంపిణీ!
ఈ ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ఇలాంటి సాహసాలు చేసి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. రైలు లోపల కాకుండా బయట భాగాల్లో, ఫుట్బోర్డులపై లేదా బోగీల మధ్య ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల కేవలం ఒకరి ప్రాణమే కాకుండా రైలు రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుందని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రెండు బోగీల మధ్య కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణం
తెలంగాణ-మంచిర్యాల పరిధిలో ఘటన
గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలుపై రెండు బోగీల మధ్య కూర్చుని ప్రమాదకరంగా వెళ్తున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు
విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పిన ప్రయాణికుడు pic.twitter.com/udppxcTsoG
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2026