Kerala: కేరళలోని త్రిసూర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక బాణసంచా తయారీ కేంద్రం (గిడ్డంగి)లో సంభవించిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ధాటికి మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఘటనా స్థలానికి అదనపు అంబులెన్సులను పంపాలని సూచించారు. పేలుడు దాటికి గిడ్డంగి పరిసర ప్రాంతాలు చిందరవందరగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తూ, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పసుపు మంగళకరమే.. కానీ ఆ రైతులకు మాత్రం కన్నీటి శాపం.. ఎందుకో తెలుసా?
త్రిశూర్ లోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
పేలుడు ధాటికి ఆరుకు మృతి, 40 మందికి పైగా తీవ్ర గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
A massive explosion at a fireworks manufacturing unit in Thrissur
Six people died in the blast, and more than 40 were seriously injured
Rescue… pic.twitter.com/l2BWfyFQic
— BIG TV Breaking News (@bigtvtelugu) April 21, 2026