E-Paper
Advertisement

కూకట్‌పల్లి ట్రిపుల్ డెత్ మిస్టరీ.. పరాయి స్త్రీతో ఫోటోలు పంపి భార్యకు టార్చర్

కూకట్‌పల్లి ట్రిపుల్ డెత్ మిస్టరీ.. పరాయి స్త్రీతో ఫోటోలు పంపి భార్యకు టార్చర్

కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న తల్లి, ఇద్దరు కుమారుల మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ విషాద ఘటనలో మృతురాలు స్రవంతి కుటుంబ సభ్యులు ఆమె భర్త ప్రవీణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. ప్రవీణే స్వయంగా తన భార్యను, పిల్లలను కొట్టి చంపారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు ఏళ్లుగా స్రవంతి తన భర్త చేతిలో నరకం చూస్తోందని ఆమె కోడలు పవిత్ర మీడియా ముందు వాపోయింది.

ప్రవీణ్ తన భార్యను శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్రంగా వేధించేవాడని తెలుస్తోంది. వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను స్రవంతికి పంపి పైశాచిక ఆనందం పొందేవాడని బంధువులు పేర్కొంటున్నారు. ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతోనే స్రవంతి తన ఇద్దరు కుమారులతో కలిసి ప్రాణాలు కోల్పోయిందని వారు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి ఇంట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లను పెద్ద కుమారుడు కార్తీక్ తన బంధువులకు పంపడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.

ప్రస్తుతం నిందితుడు ప్రవీణ్ తో పాటు అతని రెండో భార్య మహేశ్వరి కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిద్దరిని కఠినంగా శిక్షించాలని స్రవంతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తన పిల్లలను చంపిన వాడికి ఉరిశిక్ష పడాల్సిందేనని.. లేదంటే నిందితులను తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరుతున్నారు. నిందితుల ఇంటి ముందే బాధితుల మృతదేహాలను ఖననం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడి నుంచి మృతదేహాలను తొలగించే ప్రసక్తే లేదని బాధితురాలి బంధువులు తెగేసి చెబుతున్నారు.

ఈ కేసులో దొరికిన ఆడియో క్లిప్పింగులు ప్రవీణ్ క్రూరత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిందితుడిపై గతంలో ఉన్న ఫిర్యాదులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ గొడవలకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రవీణ్ మానసిక స్థితిని, అతని రెండో భార్య ప్రమేయాన్ని విశ్లేషిస్తున్న అధికారులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని స్థానికులు కూడా నిరసనలు తెలుపుతున్నారు.

తల్లి, ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలిపెట్టకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు ఉరిశిక్షే సరైన మార్గమని స్రవంతి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: ఘోరం.. కన్న కూతురిపై కాలయముడైన తండ్రి.. ప్రేమ పెళ్లి చేసుకుందని ప్రాణం తీశాడు!

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, మృతులు పెరిగే అవకాశం? పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×