పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఓ ప్రధాన రహదారిపై కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. అదుపు తప్పిన వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన (25), ముల్కనూరు గ్రామానికి చెందిన భావన (24) అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో మేఘన గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు. ఉన్నత చదువుల కోసం కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన ఆమె, అక్కడి యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతుంది.
ఇంకొక మృతురాలు భావన (24) ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు. ఆమె కూడా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి చదువుకుంటోంది.
ప్రమాద వార్త వెలువడిన వెంటనే మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు గ్రామాల్లోనూ శోకసంద్రం నెలకొంది.
Also Read: ఘోర ప్రమాదం.. డివైడర్ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది
ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి గల కారణాలపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లలో అధికారులు, భారత దౌత్య కార్యాలయం నిమగ్నమయ్యాయి.




















