E-Paper
Advertisement

Karnataka Crime: దారుణంగా పుష్ప హత్య.. ముక్కలు ముక్కలుగా చేసి..!

Karnataka Crime: దారుణంగా పుష్ప హత్య.. ముక్కలు ముక్కలుగా చేసి..!

Man Beheads wife over Heated Argument then Chops Body to Pieces: ఆలుమగల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం సర్వసాధారణం. గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయి. గొడవలు వచ్చినప్పుడు రెండుమూడు రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తరువాత మళ్లీ ఇద్దరు ఒక్కటవుతుంటారు. కానీ, ఓ భార్యాభర్తల మధ్య చిన్న వివాదం జరిగింది. అది హత్యకు దారి తీసింది. అత్యంత కిరాతంగా భార్యను హత్య చేశాడు ఆ భర్త. హత్య చేసిన అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: మిజోరంలో కూలిన రాళ్ల క్వారీ, 10 మంది మృతి..

కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శివరామ్- పుష్ప భార్యాభర్తలు. వీరికి 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. వీరు ఓ అద్దె భవనంలో నివసిస్తున్నారు. అయితే, వీరి మధ్య గత సోమవారం చిన్న వివాదం చెలరేగింది. ఈక్రమంలో ఆగ్రహంతో భర్త తన భార్యను హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను ముక్కలు ముక్కలుగా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు 32 ఏళ్లు ఉన్న పుష్పగా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణంగా గుర్తించారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×