E-Paper
Advertisement

Fire Accident Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో!

Fire Accident Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో!

Fire Breaks out in Delhi Metro: రోజు రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలులో మంటలు రావడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం వైశాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు రాజీవ్ చౌక్ స్టేషన్‌లో ఆగినప్పుడు రైలు కోచ్ రూఫ్‌పై మంటలు వచ్చాయి. అయితే దీనిని గమనించిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.

అయితే ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది. వైశాలి రూట్‌లో వెళుతున్న మెట్రో రైలుపై భాగంలో మంటలు వచ్చాయని తెలిపారు. ఈ ఘటన రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద సాయంత్రం 6.21 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన అంత ప్రమాదకరమైనదేమీ కాదని తెలిపారు.

రైలు రూఫ్‌పై వేలాడే విద్యుత్ తీగలు, వాటి నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఫాంటో గ్రాఫ్‌ల మధ్య ఏదైనా చిక్కుకుంటే స్వల్ప స్థాయిలో మంటలు వస్తాయని అన్నారు. దీని వల్ల ఎటువంటి భద్రత ముప్పు కానీ .. ప్రయాణికులు ప్రాణాపాయం కానీ ఉండదని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలపై దర్యప్తు చేపడతామని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్
వెల్లడించారు.

Also Read: Shibu Soren: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×