Nalgonda: నల్గొండ జిల్లాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సబ్ స్టేషన్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో సబ్ స్టేషన్లోని విలువైన యంత్రాలు ,విద్యుత్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
Also Read: నో బిన్.. నో బిజినెస్: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన కీలక ప్రకటన
సబ్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. VISUALS
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో ఘటన
షార్ట్ సర్క్యూట్ కారణంగా సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం
ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది
A major fire broke out at Venkatadripalem substation… pic.twitter.com/jQS06CfOF5
— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2026