Plane Crash: సౌత్ ఆఫ్రికాలో శిక్షణ విమానం కూలిపోయి హన్మకొండ జిల్లాకు చెందిన ఆడెపు సుమంత్(23) అనే యువకుడు మృతి చెందాడు. 2025లో సౌత్ ఆఫ్రికాకు సమంత్ అనే యువకుడు ఫైలట్ అవ్వాలనే కొరికతో వెల్లాడు. సమంత్ హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా అధికారులు తెలిపారు.
సుమంత్ తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసుకొని పైలెట్ కావాలనే కోరికతో సౌత్ ఆఫ్రికాకు వెల్లాడు. దీంతో సౌతాఫ్రికాలో సంవత్సర కాలంగా పాటు కార్గో పైలెట్ శిక్షణ పొందుతున్నాడు. మరో వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చేందుకు సుమంత్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో నిన్న తన తోటి స్నేహితుడు ఛార్టర్డ్ ఫ్లైట్ నడుపుతుండగా అతని పక్కన సుమంత్ కూర్చున్నాడు. అనంతరం కిందికి లాండ్ అయ్యే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి క్రాష్ ఫ్లైట్ ప్రమాదానికి గురై ఫ్లైట్లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు.
Also read: Rowdy Sheeters: గ్రేటర్ హైదరాబాద్లో తాజా మాజీ రౌడీ షీటర్ల ఇష్టా రాజ్యం.. వినక పోతే కత్తులతో..?
సుమంత్ మృతి వార్త విన్న అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో సౌతాఫ్రికాలొ మృతి చెందిన తన కుమారుడు సుమంత్ మృతదేహన్ని తమ స్వగ్రామానికి తీసుకురావడానికి ఉరి పెద్దలు మరియు అతని బందువులు, తల్లితండ్రులు కేంద్ర మంత్రి బండిసంజయ్ని కోరారు. తన కలను నిజం చేసుకుని తిరిగివస్తాడనుకున్న కొడుకు తాను మృతి చెందడంతో అతని తల్లితండ్రులతో పాటు గ్రామంలొ మొత్తం విషాద చాయలు అలుముకున్నాయి.
Also Read: Jana Sena: ప్రజారాజ్యం పాత కాపులకు పవన్ కల్యాణ్ పిలుపు.. తెలంగాణలో జనసేన నెక్ట్స్ ప్లాన్ ఇదే..?