E-Paper
Advertisement

Palnadu: నరసరావుపేటలో అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్ దగ్ధం.. రూ. 3 కోట్ల నష్టం..

Palnadu:  నరసరావుపేటలో అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్ దగ్ధం.. రూ. 3 కోట్ల నష్టం..

Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుంచి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

అగ్నిప్రమాదంలో సుమారు రూ. 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపారు. నరసరావుపేటలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ అని చెప్పారు.

అగ్నిప్రమాదం పై తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నామని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పేశామని వివరించారు.

Tags

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×