E-Paper
Advertisement

Vetapalem Ramapuram beach: తీవ్ర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

Vetapalem Ramapuram beach: తీవ్ర విషాదం.. నలుగురు విద్యార్థులు మృతి!
Advertisement

Vetapalem Ramapuram beach: ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, అందులో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరు కూడా మరిణించారని, మృతదేహాల కోసం గాలిస్తున్నామంటూ మత్స్యకారులు, సహాయక సిబ్బంది వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వస్తున్న సమాచారం ప్రకారం..

ఏపీలోని వేటపాలెం రామాపురం బీచ్ లో కొంతమంది విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. అలల తాకిడికి ఒక్కసారిగా నలుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. సహాయం కోసం కేకలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. మరో ఇద్దరు విద్యార్థుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారిద్దరూ కూడా మరిణించినట్లు మత్స్యకారులు చెబుతుండగా.. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. వారంతా కూడా ఏలూరు నుంచి వచ్చిన విద్యార్థులుగా గుర్తించారు. వారితో వచ్చిన విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Also Read: రీల్స్ చేయాలనుకుని చెట్టుకు ఉరేసుకున్నట్లు నటించబోయాడు.. చివరకు..

మృతిచెందిన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×