E-Paper
Advertisement

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!

TDP Worker Murder: వైసీపీ అరాచకం.. కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య!
Advertisement

YSRCP Workers Killed TDP Worker in Kurnool: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతోంది. ఓటమిని అంగీకరించలేని వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికీ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టబోతున్నా.. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా కర్నూల్ జిల్లాలో ఒక టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు.

వైసీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న కోపంతో.. పార్టీ కార్యకర్తను కొడవళ్లతో నరికి హతమార్చారు. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఈ విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. మృతుడిని టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.

Advertisement

Also Read: Sonakshi Sinha: తనకంటే రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్ళి.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బొమ్మిరెడ్డి పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. గిరిని హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ హత్య ఘటనను టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి ఖండించారు. అధికారాన్ని కోల్పోయినా.. వైసీపీ ఇలాంటి దారుణాలకు పాల్పడటం పై అసహనం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×