Sonipat Toll plaza: హర్యానాలోని సోనిపట్ వద్ద టోల్ ప్లాజాలో అర్ధరాత్రి కొందరు యవకులు వీరంగం సృష్టించారు. టోల్ ఫీజు చెల్లించాలని కోరినందుకు సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి తెగబడిన కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగింది?
హర్యానాలో దారుణం.. టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయిన యువకులు
హర్యానాలోని జాతీయ రహదారి 44 నెంబర్లోని భిగాన్ టోల్ ఫ్లాజా వద్ద ఊహించని ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి SUV కారుల్లో ప్రయాణిస్తున్నారు కొందరు యువకులు. టోల్ ఫ్లాజా వద్ద యువకుల వాహనాలు చేరుకున్నాయి. టోల్కు సంబంధించి అందులోని ఉద్యోగులు వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరుగా వాహనాల్లో నుంచి కిందికి దిగారు. ప్లాజా ఉద్యోగులపై కర్రలతో దాడి చేశారు. యువకులు వారిని వెంబడించి మరీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డు అయ్యింది. నాలుగు వాహనాల్లో గ్రూప్కు చెందిన యువకులు టోల్ ప్లాజా వద్దకు చేరుకోవడం, ఆపై ఉద్యోగులను వెంబడించి కొట్టడం ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తోంది.
టోల్ ఫీజు అడిగినందుకు తల పగలగొట్టారు, ఆసుపత్రిలో బాధితులు
ఈ ఘటనపై టోల్ ప్లాజా మేనేజర్ నోరు విప్పారు. క్యూలో మూడు వాహనాల నుండి దాదాపు 10 నుంచి 12 మంది యువకులు బూమ్ బారియర్ని బలవంతంగా తొలగించి ముందుకు కదిలారు. ఆ సమయంలో ఉద్యోగులపై దాడి చేశారు. దాడిలో గాయపడిన ఇద్దరు టోల్ ఉద్యోగులు సోనిపట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్లాన్ ప్రకారం ఈ దాడి జరిగిందని చెబుతున్నారు టోల్ ఫ్లాజా ఉద్యోగులు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దాడి చేసినవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.
ALSO READ: ప్రియురాలితో వీడియో కాల్.. బాలుడు సూసైడ్
నిందితులను గుర్తించడానికి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ ఒక్క టోల్ ఫ్లాజా మాత్రమే కాదు.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో టోల్ ఉద్యోగులు రాత్రి వేళ డ్యూటీలు చేయడానికి భయపడుతున్నారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
టోల్ ఫీజు అడిగినందుకు తల పగలగొట్టారు!
హర్యానాలోని సోనిపట్ సమీపంలో NH44పై ఉన్న భిగాన్ టోల్ ప్లాజా వద్ద ఘటన
టోల్ ఫీజు చెల్లించాలని కోరినందుకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడిన 10 నుంచి 12 మంది యువకులు
నాలుగు ఎస్యూవీల్లో వచ్చి బారియర్లను తొలగించి దౌర్జన్యంగా… pic.twitter.com/ZKdmLW4kt1
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2026