Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. భిక్యాసేన్ ప్రాంతం నుండి రామ్నగర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.