BigTV English

Ayodhya : అయోధ్య ఆలయ పూజారులు వీరే..!

Ayodhya : అయోధ్య ఆలయ పూజారులు వీరే..!

Ayodhya : అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధమైంది. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమం కోసం ‘రామనంది’ అనే సంప్రదాయం ప్రకారం జరగనుంది. ఈ సంప్రదాయం మేరకే ఆలయంలో పూజలు కొనసాగనున్నాయి. ఆ ‘రామనంది’ శాఖ విశేషాలు మీకోసం..


రామనంది శాఖను జగద్గురు రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ పురాతన బైరాగి సాధు సంప్రదాయంలో ఒక భాగం. దీనికి బైరాగి శాఖతో బాటు రామవత్ శాఖ, శ్రీ శాఖ అనే పేర్లు కూడా ఉన్నాయి. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. వీరి మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’. వీరు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు.

రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. పసిపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో రాముడిని పూజిస్తారు. ఈ పూజా విధానంలో బాలరాముడిని రోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి చేస్తారు.


ఈ రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు.

Related News

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Big Stories

×