BigTV English
Advertisement

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Dorababu Pendem : ఇన్‌ఛార్జిల మార్పుతో వైసీపీలో పొలిటికల్ కాక రేగుతోంది. ఆ పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే జన్మదిన వేడుక బలప్రదర్శనకు వేదికైంది.


పిఠాపురం సీటుపై సీఎం జగన్‌ పునరాలోచించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టుందని.. దాదాపు 50వేల మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. పిఠాపురం టికెట్‌ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. సీఎం జగన్ ఆలోచించి తనకే సీటు ఇస్తారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే దొరబాబు జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్‌ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను.. పిఠాపురం పార్టీ ఇన్‌ఛార్జిగా అధిష్ఠానం నియమించింది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×