E-Paper
Advertisement

Ayodhya Bell : అయోధ్య రాముడికి విరాళంగా భారీ గంట.. ఏకంగా రూ.25 లక్షలతో..

Ayodhya Bell : అయోధ్య రాముడికి విరాళంగా భారీ గంట.. ఏకంగా రూ.25 లక్షలతో..

Ayodhya Bell : అయోధ్య రాముడికోసం 2500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం సిద్ధమైంది. ఈ గంటను తయారు చేసేందుకు అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. గంటను మోగించినపుడు.. టంగ్ అని కాకుండా ఓంకాంరం శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జిక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేసినట్లు తెలిపారు. గంటను తయారు చేసేందుకు మూడు నెలల సమయం పట్టగా.. 250 మంది కార్మికులు పాల్గొన్నట్లు వివరించారు.

కాగా.. 2020 అక్టోబర్ లో 613 కేజీల బరువైన గంటను చెన్నైకి చెందిన న్యాయహక్కుల మండలి ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మండా ఆలయ ట్రస్టు సభ్యులకు అందజేశారు. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉన్న ఆ గంటపై సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలతో పాటు.. జైశ్రీరామ్ అనే అక్షరాలను చెక్కారు. ఈ గంటను మోగించినపుడు ఓంకారం శబ్ధం వినిపిస్తుందని అప్పట్లో భక్తులు వెల్లడించారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×