BigTV English

Lord Shani: ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం, సమస్యలు తప్పవు

Lord Shani: ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం, సమస్యలు తప్పవు

Lord Shani: శని సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని పిలుస్తారు. ఈ ఏడాది శని కుంభ రాశిలో సంచరిస్తోంది. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకోనున్నాడు. 2025లో శని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. 2025 నుంచి ఏలినాటి శని మీన రాశి వారికి మొదలవుతుంది . శని సంవత్సరం అయిన 2024 లో శని తన రాశిని మార్చుకోవు. కానీ 2025 సంవత్సరంలో శని తన రాశిని మార్చుకుంటుంది. అంతే కాకుండా తిరోగమన దశలో కూడా సంచరిస్తుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తోంది


శని రాశి మార్పు వల్ల ఏలినాటి శని లేదా సాడే సాతీ అర్ధాష్టమ శని ప్రభావం కూడా మారుతుంది. 2025 లో శని మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశికి అధిపతి బృహస్పతిగా చెబుతుంటారు. ఈ రాశిలో శని, మీన రాశిని కూడా నియంత్రిస్తుంది. ఏలినాటి శని వల్ల మొదటి దశ ఈ రాశులపై ప్రారంభం అవుతుంది. దీని నుంచి బయటపడాలంటే మీన రాశి వారు చాలా కాలం వేచి చూడాలి. ఏడున్నర సంవత్సరాలపాటు శని ప్రభావం ఉంటుంది.

మీన రాశి వారికి సాడే సాతీ నుంచి 2030 సంవత్సరంలో విముక్తి లభిస్తుంది. ఏ కాలంలో ఏ రాశుల వారికి శని సాడే సాతీ ప్రారంభమవుతుంది. ఏ రాశుల వారు శని ఆధీనంలో ఉంటారు.ఈ రాశిలో శని దయా స్థితిలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


శని రాశిమార్పు:
2023 నుంచి శని కుంభరాశిలో ఉంటుంది. శని గ్రహం 2023 జనవరి 15 న కుంభ రాశిలోకి ప్రవేశించింది. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. వచ్చే ఏడాది 2025 లో చెన్నై కుంభ రాష్ట్ర వీడి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు కుంభం రాశిలో శని ఉండటం వల్లస్డే సతి మకరం కుంభ రాశులపై ఉంటుంది ఇది కాకుండా కర్కాటక వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది.

శని మీనరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏలినాటి నుంచి వచ్చే ఏడాది విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం మకరరాశిలో సాడే సాతి కొనసాగుతోంది. మరో ఏడు నెలల పాటు ఇది ఉంటుంది. మీనరాశిలో శని రాకతో ఈ రాశి వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి 2028 లో మోక్షం కలుగుతుంది.

Also Read: మీన రాశిలోకి బృహస్పతి ప్రవేశంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతుంది

కుంభరాశి వారికి 2028 లో శని గ్రహం నుంచి విముక్తి లభిస్తుంది. ఇదే కాకుండా 2025 సంవత్సరం నుంచి మేషరాశిలో కూడా శని సాడే సాతీ ప్రారంభం అవుతుంది. ఇది మే 30, 2032 వరకు కొనసాగుతుంది. సింహం, ధనస్సు రాశి వారికి వచ్చే ఏడాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. ఇది 2025 వరకు రెండు రాశుల మీద రెండున్నర సంవత్సరాలపాటు ప్రభావం చూపుతుంది.  ఈ సమయంలో ఈ రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×