E-Paper
Advertisement

Navratri 2025: నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం, విశిష్టత ఏమిటి ?

Navratri 2025: నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం, విశిష్టత ఏమిటి ?
Advertisement

Navratri 2025: దేవి నవరాత్రులను దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి నుంచి నవమి వరకు దేవి నవరాత్రులను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. అయితే ఈ ఏడాది శరద్ నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22న ప్రారంభమై.. అక్టోబర్ 2వ వరకు కొనసాగుతాయి. దేవి నవరాత్రుల ప్రాముఖ్యతతో పాటు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రి ప్రాముఖ్యత:
నవరాత్రి పండుగకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం. ఈ విజయం అహంకారం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రెండవది.. శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి, ఆ తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి, పదవ రోజున రావణ దహనం చేస్తారు. ఈ పండుగ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి, శుభాలను పొందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

Advertisement

నవరాత్రి రోజువారీ పూజలు:

ఈ పండుగలో భాగంగా భక్తులు వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Advertisement

కలశ స్థాపన: మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఇది ఇంటిని శుద్ధి చేసి.. పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది.

ఉపవాసం: చాలా మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పండ్లు లేదా ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.

దేవి పూజ: ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు.

కన్యా పూజ: అష్టమి లేదా నవమి రోజున 9 మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి.. వారిని దుర్గాదేవి రూపాలుగా భావించి పూజిస్తారు. వారికి కొత్త దుస్తులు, ప్రసాదాలు, కానుకలు సమర్పిస్తారు.

పూజ: ఆయుధ పూజ లేదా సరస్వతి పూజగా పిలువబడే ఈ రోజున పుస్తకాలు, ఆయుధాలు, సంగీత పరికరాలు, వృత్తికి సంబంధించిన వస్తువులను పూజిస్తారు.

దేవి నవరాత్రి అనేది భక్తి, శ్రద్ధ, సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన పండుగ. ఈ పండుగ ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని, ఐక్యతను పెంచుతుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ, భక్తులకు నమ్మకం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×