E-Paper
Advertisement

Nayanthara: నయన్‌ను వీడని ‘చంద్రముఖి’.. నోటీసులు ఇచ్చిన నిర్మాతలు? వాస్తవం ఏమిటంటే?

Nayanthara: నయన్‌ను వీడని ‘చంద్రముఖి’.. నోటీసులు ఇచ్చిన నిర్మాతలు? వాస్తవం ఏమిటంటే?

Nayanthara Documentary Controversy: స్టార్హీరోయిన్నయతనార మరో వివాదంలో నిలిచింది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితం ఆధారంగా ఇటీవల డాక్యుమెంటరీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్నయనతార బియాండ్ది ఫెయిరీ టేల్‌’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది విడుదల తర్వాత కోలీవుడ్ హాట్టాపిక్గా మారింది. ఇందులో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి నయన్‌ ప్రస్తావించారు. తను సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత హీరోయిన్‌ నుంచి లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన తీరు.. తనకు ఎదురైన అనుభవాలు, లవ్‌, బ్రేక్‌.. విఘ్నేశ్‌ శివన్‌ పరిచయం.. నుంచి పెళ్లి వరకు ప్రతి విషయాన్ని ఆవిష్కరించారు.అయితే ఇందులో నానుమ్‌ రౌడీ దాన్‌ మూవీ క్లీప్‌ వాడటంపై ధనుష్తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడుదీనిపై నయన్దంపతులకు పరువునష్టం దావా వేశాడు.

మొన్న ధనుష్, ఇప్పుడు చంద్రముఖి టీం

ప్రస్తుతం కేసు మద్రాస్కోర్టులో ఉందిఅదే సమయంలో చంద్రముఖి మూవీ టీం కూడా నయన్డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోది.  ఈ వ్యవహారంపై చంద్రముఖి మూవీ నిర్మాతలు మద్రాస్హైకోర్టును ఆశ్రయించారు. డాక్యుమెంటరీలో మూవీకి సంబంధించిన ఫుటేజీని అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ నయనతార, నెట్‌ఫ్లిక్స్‌పై పరువు నష్టం దావా వేసింది. అంతేకాదు కాపీ రైట్కింద రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్చేశారు. ఈ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు విచారణకు స్వీకరించి డాక్యుమెంటరీ నిర్మాతలు టార్క్ స్టూడియో ఎల్‌ఎల్‌పీకి, నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసి.. వచ్చేనెల అక్టోబర్‌ 6వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చంద్రముఖి మూవీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము నయనతారకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తాము రూ. 5 కోట్లు డిమాండ్ చేశామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేసింది.

Also Read: Kishkindhapuri First Review: కిష్కంధపురి ఫస్ట్ రివ్యూ… హర్రర్ ప్లస్ థ్రిల్లర్

నయనతారపై పరువు నష్టం దావా

కాగా నయనతార డాక్యుమెంటరీలో ధనుష్నిర్మాణంలో తెరకెక్కిన నానుమ్రౌడీ దాన్మూవీ క్లిప్వాడటం వివాదానికి దారి తీసింది. తమ అనుమతి లేకుండ మూవీ క్లిప్వాడటంపై ధనుష్తీవ్ర అభ్యంతరం తెలిపాడు. విషయమైన నయన్దంపతులపై పరువు నష్టం దావా వేశాడు. కాపీ రైట్కేసు కింద రూ. 10 కోట్లు డిమాండ్చేశాడు. దీనిపై నయనతార, విఘ్నేశ్శివన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం వ్యవహరంలో కోర్టులో ఉంది. ధనుష్కేసులో నయన్దంపతులు నోటీసులు కూడా వెళ్లాయి. కానీ, దీనిపై వారు స్పందించకపోవడం గమనార్హం

కాగా నయన్భర్త విఘ్నేశ్శివన్దర్శకుడిగా పరిచయం అవుతూ.. విజయ్సేతుపతి, నయనతారలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రానికి సంబంధించిన మూడు సెకన్ల క్లిప్వాడారు. ఇదే మూవీ సెట్లో నయనతార, విఘ్నేశ్శివన్లకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ, పెళ్లి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను ఉన్న మూవీ క్లిప్ని వాడమని, ఇందుకు ధనుష్పర్మిషన్కోసం ప్రయత్నించామని నయనతార ఓపోస్ట్వెల్లడించింది. కానీ, విషయంపై ధనుష్కనీసం మాట్లాడేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వాలేదని చెప్పింది. దీనిక ధనుష్ఎన్నోసార్లు ఫోన్చేసిన ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పింది. ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరకు మూవీ షూటింగ్టైంలో తమ ఫోన్చిత్రీకరించిన క్లిప్స్వాడమని వివరణ ఇచ్చింది.

Related News

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

Big Stories

×