BigTV English
Advertisement

Significance Of Aditya Hridayam: ఆదిత్య హృదయం ఎలా ఆవిర్భవించిందంటే…!

Significance Of Aditya Hridayam: ఆదిత్య హృదయం ఎలా ఆవిర్భవించిందంటే…!

 


Learn Here Sri Aditya Hrudayam

Learn Here Sri Aditya Hrudayam: రామ రావణ సంగ్రామం అత్యంత భీకరంగా జరుగుతోంది. కానీ.. ఎంత ప్రయత్నించినా రామచంద్రుడు రావణాసురుడిని ఓడించలేకపోతున్నాడు. ఒకవైపు శరీరం అలసి పోతోంది. మరోవైపు తనను నమ్ముకుని వచ్చిన వానర సేనలు రావణుడి సేనల చేతిలో అన్యాయంగా బలి అయిపోతున్నాయనే అపరాధ భావన ఆయన మనసును కుదిపేస్తోంది. ఇక.. రాముడు వేసిన అస్త్రాలన్నీ రావణుడిని ఏమీచేయలేక నేలరాలిపోతున్నాయి. నాటి వరకు ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాని రామచంద్రుడు దీనికి కారణమేమిటో అర్థంకాక సతమతమైపోతున్నాడు. రాముడి మనసులో క్రమంగా యుద్ధం పట్ల విముఖత ఏర్పడుతోంది.


మరోవైపు తన శిష్యుడైన రామచంద్రుడు చేస్తున్న అద్భుతమైన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కుల గురువైన వశిష్టుడు, దేవతా గణాలతో సహా యుద్ధభూమికి వచ్చి ఇదంతా గమనించాడు. అప్పటి వరకు తనను తాను కేవలం మానవుడినే అనుకుంటున్న తన శిష్యుడైన రాముడిలో ఉన్న విష్ణు చైతన్యాన్ని తట్టి లేపితే తప్ప రావణ వధ సాధ్యం కాదని వశిష్టుడికి అర్థమైంది.

ఆ రోజు యుద్ధం పూర్తికాగానే.. వశిష్టుడు రాముడి వద్దకు వచ్చి.. ‘రామా..! నీకు మహిమాన్వితమైన ఆదిత్య హ ఒక మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. దీనిని 3 సార్లు పఠిస్తే.. అత్యంత సులభంగా నీవు రావణుడిని సంహరించగలవు’ అని ఆదిత్య హృదయాన్ని బోధించాడు. తర్వాత గురువు సూచించిన ప్రకారమే.. రాముడు.. దానిని పఠించటం, వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై రాముడికి దివ్యశక్తిని ప్రసాదించటం, ఆ ద్విగుణీకృతమైన శక్తితో రాముడు రావణుడిని అనాయాసంగా వధించటం జరిగిపోయాయి.

Read more: ‘గోవిందా’ అనే పేరు వెనక కథ తెలుసా?

నాటి నుంచి ఆరోగ్యం, విజయం కోరుకునే వారికి ఆదిత్య హృదయం నిత్య పారాయణా స్త్రోత్రంగా మారిపోయింది. రోజూ దీనిని పారాయణ చేయలేని వారు కనీసం ఆదివారం రోజునైనా దీనిని పారాయణ చేయాలని, ముఖ్యంగా జాతకంలో రవి బలహీనంగా ఉన్నవారు దీనిని పారాయణం చేయటం వల్ల జాతకదోషాలు తొలగిపోతాయి.

ఎవరి జాతకంలోనైనా రవి బలహీనంగా ఉంటే.. వారు తరచూ అనారోగ్యం పాలవటం, ఉద్యోగులైతే పై అధికారుల వేధింపులకు గురికావటం, కంటి రోగాలు, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. వీరు ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే.. తరచూ తండ్రి తరపు బంధువులతో వివాదాలతో విసిగిపోయిన వారు, ఏదైనా సాధించాలనే పట్టుదల, కసి లేనివారు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి నిరంతరం భయపడుతూ ఉండేవారు రోజూ దీనిని పారాయణం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

ముఖ్యంగా ఆదివారం రోజున వేకువనే లేచి, తలస్నానం చేసి, సూర్యోదయ సమయానికి తూర్పు ముఖంగా నిలిచి నమస్కరించి, ఆదిత్య హృదయం పారాయణ చేసి, గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని స్వామికి నివేదన చేస్తే.. అఖండమైన విజయాలు, మంచి ఆరోగ్యం సిద్ధిస్తాయి.

Tags

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×