Karthika Pournami 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు చాలా పవిత్రమైంది. ఈ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి 15 నవంబర్ 2024 న జరుపుకోనున్నారు.
కార్తీక పూర్ణిమ హిందువులలో అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజు విష్ణువు, చంద్రుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజులలో ఒకటిగా చెప్పబడుతుంది.ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి.. సత్యనారాయణుడి పూజిస్తారు.
దేశ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు గంగాస్నానం, దానధర్మాలు, పూజలు చేయడం వల్ల రెట్టింపు పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజు పాటించాల్సిన నియమాలు:
ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజు భక్తులు స్నానం కోసం గంగా స్నానం చేయడం మంచిది. దీంతో జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా ఈ రోజు సత్యనారయణ వ్రతాన్ని ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ రోజు గంగా స్నానం చేసి దీపదానం చేసి నది ఒడ్డున మట్టి దీపం వెలిగించాలి. ఈ శుభ సందర్భంలో విష్ణువు, శివుని మంత్రాలను పఠించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కార్తీక పూర్ణిమ నాడు భగవద్గీత, రామాయణం, కార్తీక మాహాత్మ్య కథ వంటి మతపరమైన గ్రంథాలను తప్పనిసరిగా చదవాలి.
Also Read: శుక్రవారం రోజు ఈ పరిహారాలు చేస్తే.. అపార ధనలాభం
ఈ రోజు సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చే సంప్రదాయం కూడా ఉంటుంది. కార్తీక పౌర్ణమి స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం. కార్తీక మాసం పౌర్ణమి తేదీ నవంబర్ 15 ఉదయం 06:19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 02:58 గంటలకు ముగుస్తుంది.
అదే సమయంలో.. ఈ రోజున నదీ స్నానం, దానం చేయడానికి శుభ సమయం ఉదయం 04.58 నుండి 05.51 వరకు ఉంటుంది. అలాగే చంద్రోదయం సాయంత్రం 04:51 గంటల వరకు ఉంటుంది.