E-Paper
Advertisement

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Diwali 2025: దీపావళి పండగను ఏ రోజు జరుపుకోవాలి ? అక్టోబర్ 20 లేదా 21 నా?

Diwali 2025: దీపావళి లేదా హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. అయితే.. ప్రతి సంవత్సరం తిథుల విషయంలో వచ్చే మార్పుల కారణంగా.. పండుగను ఏ రోజు జరుపుకోవాలనే దానిపై కొంత గందర గోళం నెలకొంటుంది. 2025 సంవత్సరానికి సంబంధించి.. దీపావళిని అక్టోబర్ 20వ తేదీనా లేక 21వ తేదీనా జరుపుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంది.

అమావాస్య తిథి:
దీపావళి పండగను హిందూ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథి రోజున జరుపు కోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ అమావాస్య రాత్రి సమయంలోనే లక్ష్మీ దేవి పూజను అత్యంత ముఖ్యంగా భావించి నిర్వహిస్తారు.

ఈ ఏడాది అమావాస్య తిథి:
అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 3:44 గంటలకు అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది.

అమావాస్య తిథి ముగింపు: అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5:54 గంటలకు తిథి పూర్తవుతుంది.

పండితులు ఏం చెబుతారు ?

సాధారణంగా హిందూ పండగలను సూర్యోదయ తిథిని బట్టి నిర్ణయించినప్పటికీ.. దీపావళి పండగ విషయంలో నియమం కాస్త భిన్నంగా ఉంటుంది. దీపావళి ప్రధాన వేడుక అయిన లక్ష్మీ పూజను సూర్యాస్తమయం తర్వాత , అర్ధ రాత్రికి ముందు ఉండే ప్రదోష కాలంలో  నిర్వహిస్తారు.

అక్టోబర్ 20, 2025న సాయంత్రం అమావాస్య తిథి ప్రారంభమై.. ఆ రోజే ప్రదోష కాలం, నిశిత కాలం కలుస్తుంది. కాబట్టి.. శాస్త్రాల ప్రకారం.. అక్టోబర్ 20 సోమవారం రోజున దీపావళి పండగను, లక్ష్మీ పూజను జరుపుకోవడం అత్యంత శుభప్రదమని, సరైందని పండితులు చెబుతున్నారు.

Also Read: ఏ కన్ను అదిరితే మంచిది ? పురాణాల్లో ఏముంది ?

లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం (అక్టోబర్ 20):

దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 2025 దీపావళికి లక్ష్మీ పూజ నిర్వహించడానికి శుభ సమయం..

లక్ష్మీ పూజ ముహూర్తం: రాత్రి 7:08 నుంచి 8:18 వరకు లక్ష్మీ పూజలు నిర్వహించవచ్చు.

వ్యవధి: 1 గంట 11 నిమిషాలు.

ప్రదోష కాలం: సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు ప్రదోష కాలంగా చెబుతారు.

అమావాస్య తిథి రాత్రి పూట ఆ రోజున లక్ష్మీ పూజకు ప్రదోష కాలం లభిస్తుంది కాబట్టి.. ఈ ఏడాది దీపావళి పండగను అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకోవడమే సరైంది. అక్టోబర్ 21వ తేదీన అమావాస్య తిథి ఉదయం 5:54 గంటలకే ముగుస్తుంది. కాబట్టి ఆ రోజున రాత్రి పూజకు తిథి ఉండదు. కాబట్టి.. అక్టోబర్ 20న దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించి.. ఈ వెలుగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×