BigTV English

Puri jagannath temple : పూరీలో బంగారు పళ్లెంను మాయం చేసిదెవరు..?

Puri jagannath temple : పూరీలో బంగారు పళ్లెంను మాయం చేసిదెవరు..?
jagannath temple


Puri jagannath temple : జగన్నాధుడు కొలువైన పూరిలో ఏ ఆలయాన్ని చూసినా, ఏ విగ్రహాన్ని దర్శించుకున్నా , ఏ స్తంభాన్ని ముట్టుకున్నా వాటి వెనుక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. పూరీ జగన్నాథ ఆలయం మాడవీధుల్లో బయటకి వచ్చేటప్పుడు ఆగ్నేయం వైపు ఒక మురికి గుంట కనిపిస్తుంది. దాన్ని పేజ్ నాలాగా పిలుస్తారు. ఒక సమయంలో తనను నమ్ముకున్న కటిక పేదవాడైన ఒక వ్యక్తికి స్వామికి ఆలయంలో ఉపయోగించే బంగారం పళ్లెంలో 56 రకాల పదార్దాలు వండించి పెట్టి అదృశ్యమవుతాడు.

పళ్లెం కనిపించడం లేదని వెదికిన ఆలయ సిబ్బంది ఆ పేదవ్యక్తిని జైలులో బంధిస్తారు. తాము దొంగతనం చేయలన పేదోడి భార్య చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆసమయంలో ప్రతాపరుద్రు మహారాజు కలలో స్వామి కనిపించి తన భక్తుడ్నుి చెరశాలలో వేసిన సంగతి చెప్పి విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. లేదంటో పూరీ క్షేత్రాన్ని విడిచిపోతానని స్వామి చెప్పారట. వెంటనే ప్రతాప రుద్రుడు ఆగమేఘాలపై వచ్చి పేదభక్తుడి కాళ్లమీద పడి క్షమాపణ కోరతాడు . స్వామి భక్తుడికి రాజ్యంలో కోశాధికారి పదవి ఇచ్చి గౌరవిస్తాడు. స్వామి తలుచుకుంటే జరిగేది ఇదే.


ఇదంతా పేజ్ నాలా దగ్గర జరిగింది. ఇప్పుడు ఆ పేజ్ నాల్ దగ్గర చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో కూర్చుని జగన్నాధ స్వామిని స్మరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పేజ్ నాలా ఆలయానికి దక్షిణ ఆగ్నేయంలో కనిపిస్తుంది. పూరిలో ఇలా గోడను వెతికినా ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అవన్నీ తెలుసుకుని వెళ్లినప్పుడు మనసు ఆనందం పడుతుంది. మీరు సంతోషంగా ఉంటారు.

స్వామి ఏదైనా చెప్పాలనుకుంటే రథాన్ని ఆపుతాడు లేదంటే పాలకుల కలలోకి వచ్చి చెబుతాడట. జగన్నాథ రధచక్రాలు ముందుకు కదలడం లేదంటే ఏదో తప్పు జరిగి ఉండాలి. లేకపోతే స్వామి ఏదో చెప్పుతున్నారన్న సందేశం అయినా అయిండాలని స్వామి భక్తులు చెబుతుంటారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×