Express Train Incident: తూర్పుగోదావరి జిల్లాలో ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం జరిగింది. విశాఖపట్నం – మహబూబ్ నగర్ రైలు.. అనపర్తి , రాజమండ్రి మధ్యలో ట్రైన్ చక్రాలు బ్రేక్ పట్టి నిప్పురవ్వలు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపి వేసి.. ప్రయాణికులను పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దింపేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ట్రైన్ అక్కడే ఆపివేశారు. ట్రైన్ చక్రాలలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అనంతరం బ్రేకులను సరిచేసి రాజమండ్రి స్టేషన్ వద్దకు తీసుకొని వచ్చారు. బ్రేకులు పట్టిన బోగిని రాజమండ్రి స్టేషన్లో మార్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.