Aadi Sai Kumar: ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా అలాంటి హిట్ ను అందుకోలేకపోయాడు. ఇక అలా అని అవకాశాలు రావడం లేదా.. ? అది కూడా కాదు. ఇప్పటివరకు ఆది.. మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీస్తూ వచ్చాడు. కానీ, అతనికి లక్ కలిసిరాలేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసితో ఒక సినిమాను మొదలుపెట్టాడు. అదే కృష్ణ ఫ్రమ్ బృందావనం.
వీరభద్ర చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది సరసన దిగంగనా సూర్యవంశీ నటిస్తోంది. ఆది- వీరభద్ర చౌదరి కాంబోలో ఇప్పటికే చుట్టాలబ్బాయి అనే సినిమా వచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అయితే అందుకుంది కానీ, కలక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక చాలా కాలంతరువాత ఈ కాంబో రిపీట్ అయ్యింది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు కాకతీయ హిల్స్ లోని వెంకటేశ్వర ఆలయంలో గ్రాండ్ గా జరిగాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈ పూజకు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్ కు దిల్ రాజు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అందజేశాడు. కెమెరాను సాయి కుమార్ స్విచ్ ఆన్ చేశాడు. “వీరభద్రంతో మరో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మంచి కథ దొరికింది. కుటుంబం మొత్తం నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. జూన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది” అని ఆది సాయి కుమార్ చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతోనైనా అతనికి హిట్ వస్తుందా.. ? లేదా ..? అనేది తెలియాల్సి ఉంది.
#KrishnaFromBrindavanam in the successful combination of @iamaadisaikumar & @veerabhadramdir was launched grandly today in the presence of #DilRaju & @AnilRavipudi #aadisaikumar #ThumuNarsimha #FilmifyTelugu #FilmifyEnglish pic.twitter.com/MIzjj6Pd2B
— Filmify Official (@FilmifyTelugu) April 18, 2024