E-Paper
Advertisement

Akhil Akkineni: అఖిల్ పీరియాడికల్ డ్రామా, అయ్యగారికి వాళ్ళ అయ్యగారే ప్రొడ్యూసర్

Akhil Akkineni: అఖిల్ పీరియాడికల్ డ్రామా, అయ్యగారికి వాళ్ళ అయ్యగారే ప్రొడ్యూసర్

Akhil Akkineni: సిసింద్రీ సినిమాతో బాల నటుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. చాలా చిన్న ఏజ్ లో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పొచ్చు. ఆ తర్వాత విక్రం కే కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో కనిపించిన కాసేపు కూడా అద్భుతంగా అనిపించాడు. అక్కినేని నట వారసుల్లో అఖిల్ అద్భుతంగా సినిమాలు చేసి వారసత్వాన్ని నిలబెడతాడు అని అందరూ అనుకున్నారు. అఖిల్ హీరోగా పరిచయమైన సినిమా అఖిల్ (Akhil). ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

అఖిల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అఖిల్, అక్కినేని హీరోలలా కాకుండా డాన్సులు మాత్రం అద్భుతంగా చేసాడు. మొదటి సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడు అని కొంతమంది ద్వారా ప్రశంసలు కూడా అందుకున్నాడు. కానీ అఖిల్ కి సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా కూడా అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడాయి. చివరికి మనం లాంటి సూపర్ హిట్ సినిమాను అక్కినేని ఫ్యామిలీకి అందించిన విక్రం కే కుమార్ హలో సినిమా కూడా ఊహించిన విజయాన్ని అఖిల్ కి ఇవ్వలేకపోయింది.

ఇకపోతే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి అఖిల్ ఖాతాలో ఒక హిట్ గా నిలిచింది. ఇక ఆల్మోస్ట్ అఖిల్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు అనుకునే తరుణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా తీవ్రమైన డిజాస్టర్ అయింది. ఇప్పటికీ ఓటిటి రిలీజ్ కూడా ఆ సినిమా నోచుకోలేదు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక సినిమా కూడా అఖిల్ చేయలేదు. అయితే అఖిల్ యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాను చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ గా అఖిల్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఒక పిరియాడికల్ డ్రామా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి నిర్మాతగా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అతి త్వరలో దీని గురించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన వినరో భాగ్యమే విష్ణు కథ అనే సినిమాకు దర్శకుడుగా పనిచేశాడు మురళీ కిషోర్. ఈ సినిమాను గీత ఆర్ట్స్ పై బన్నీ వాసు నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు కానీ దర్శకుడుగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉన్నట్లు లీడ్ ఇచ్చారు. కానీ ఊహించిన స్థాయిలో సినిమా ఆడకపోవటం వలన ఆ సీక్వెల్ పక్కన పెట్టేసారని అర్థమవుతుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×