BigTV English
Advertisement

Pushpa 2 : అల్లు, మెగా ఫ్యాన్ వార్ స్టార్ట్… స్పెషల్ పోస్టర్లతో ఓపెన్ గా ఇచ్చి పడేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Pushpa 2 : అల్లు, మెగా ఫ్యాన్ వార్ స్టార్ట్… స్పెషల్ పోస్టర్లతో ఓపెన్ గా ఇచ్చి పడేస్తున్న బన్నీ ఫ్యాన్స్

Pushpa 2 : అల్లు వర్సెస్ మెగా వార్ అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. తాజాగా కొంత మంది అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ‘ఎవడు వస్తాడో చూసుకుందాం రండి’ అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో ఈ వివాదం మొదలైంది. ఆ బ్యానర్ల ఫోటోలను షేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు, వాటికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ మెగా అభిమానులు ఎక్స్ వేదికగా గొడవకు దిగుతున్నారు. అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లు ఎక్కడ కట్టారు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఏపీ ఎలక్షన్స్ లో  ఈసారి పవన్ కళ్యాణ్ కింగ్ (Pawan Kalyan) మేకర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే, ఒక్క అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం ఆపోజిట్ పార్టీ నేతకు సపోర్ట్ చేయడం వివాదాన్ని రేకెత్తించింది. ఈ విషయంపై ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా విజయవాడలో దీనికి సంబంధించి స్పెషల్ గా బ్యానర్లు వెలిసి, అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా మెగా అభిమానుల దృష్టిని అని చెప్పుకోవాలి. ఆ బ్యానర్లలో ఒకదాంట్లో ‘ఏం పీకలేరు బ్రదర్స్’ అని, మరొక బ్యానర్లో ‘ఏం పీకలేరు బ్రదర్.. ఎవడు వస్తాడో రండిరా’ అని ఉంది. అలాగే ‘మా హీరో అంటే మాకు పిచ్చబ్బా… మా హీరో కి నచ్చితే వస్తాడు, మా వాడి మనసుకు నచ్చితే మన అనుకునే వాడికోసం వస్తాడు’ అంటూ సినిమా రేంజ్ లో డైలాగులు పెట్టి మరీ బ్యానర్లను కట్టారు.

ప్రస్తుతం ఆ బ్యానర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొంతమంది మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ (Allu Arjun) పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదన్న కోపంతో ఆయనను ఓ రేంజ్ లో మెగా అభిమానులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో ఆ రివేంజ్ ను ఇలా తీర్చుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. మరి ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.


ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప 2 : ది రూల్” (Pushpa 2) మూవీ గురించి ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. సుకుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటింది అంటూ నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సమంత, శ్రీ లీల స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా “పుష్ప 2” మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ అల్లు వర్సెస్ మెగా వార్ జరగడం, ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×