E-Paper
Advertisement

Pushpa 2 Tragic Stampede: సంధ్యా థియేటర్ విషాద ఘటన.. ఫిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్..!

Pushpa 2 Tragic Stampede: సంధ్యా థియేటర్ విషాద ఘటన.. ఫిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్..!
Advertisement

Pushpa 2 Tragic Stampede: అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా, సుకుమార్(Sukumar )దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప -2 (Pushpa-2). యావత్ దేశ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలయ్యింది. కానీ బెనిఫిట్ షోలు డిసెంబర్ 4 అర్థరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బెనిఫిట్ షోలలో చోటు చేసుకున్న విషాద ఘటన కారణంగా తాజాగా పుష్ప -2 సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని(Ramarao immineni) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు.

పుష్ప -2 పై మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు..

Advertisement

సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు అని, ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్స్ పై లాఠీ చార్జి చేయడం, ముందస్తు జాగ్రత్తలేమి తీసుకోకపోవడం వల్లే మహిళ మృతి చెందినట్లు ఆయన తన పిటీషన్ లో తెలిపారు. ముఖ్యంగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పిటీషన్ ను స్వీకరించిన మానవ హక్కుల కమిషన్..

Advertisement

దీనిపై పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ దీనిపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది. ఇక దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తెలియనంది.

సంధ్య థియేటర్లో విషాద ఘటన..

అభిమాన హీరో సినిమా చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని సంధ్య థియేటర్ కి తరలివచ్చారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో థియేటర్ కి అల్లు అర్జున్ కూడా రావడం గమనించిన అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది.వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి పబ్లిక్ ఫిగర్స్ బయటకు వచ్చినప్పుడు భద్రతా బలగాల మధ్య బయటకి రావాల్సి ఉంటుంది. కానీ వీరు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆడియన్స్ ముందుకు రావడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఇక దాంతో ఆడియన్స్ పై లాఠీచార్జి నిర్వహించారు. ఇక దాని నుంచి తప్పించుకోవడానికి ఆడియన్స్ పరుగులు పెట్టారట. అలా తొక్కిసలాట జరిగగా.. ఆ సందర్భంలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అంతేకాదు ఆమె కొడుకు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపై బెనిఫిట్ షోలు రద్దు..

ఈ విషయం తెలిసి పలువురు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ ఆ సమయంలో అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏది ఏమైనా ఒక చిన్న పొరపాటు కారణంగా అటు నిర్మాతలకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పవచ్చు.

Related News

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Big Stories

Advertisement
×