E-Paper
Advertisement

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్

Chiranjeevi: కేరళ సీఎంను కలిసి విరాళం అందజేసిన మెగాస్టార్

Chiranjeevi: కేరళలోని వయనాడ్ లో భారీ వర్షాలు ఎంత విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాల వలన కొండచరియలు విరిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరెంతోమంది గాయాలపాలయ్యారు. ఇంకెంతోమంది నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా నిలబడుతుంది.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు.. కేరళ ప్రభుత్వానికి విరాళాలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే. వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను, రామ్ చరణ్ కలిసి రూ. కోటి రూపాయలు అందిస్తున్నట్లు చిరు ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా నేడు మెగాస్టార్ స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి.. కోటి రూపాయల చెక్ ను అందజేశారు. వయనాడ్ విధ్వంసం గురించి కొద్దిసేపు సీఎంతో చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతో పాటు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రష్మిక లాంటి హీరోలు విరాళాలు అందించగా.. కోలీవుడ్ నుంచి సూర్య, విక్రమ్, కమల్ హాసన్ తదితరులు విరాళాలు అందించారు.

ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే … ప్రస్తుతం చిరు, విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×