Big Stories

Raghubabu: బ్రేకింగ్.. రఘుబాబు కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Raghubabu: బీఆర్‌ఎస్‌ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు కోర్టులో ఊరట లభించింది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం మధ్యాహ్నం వెంచర్ వద్దకు వెళ్లి బైక్‌పై వస్తున్న ధినేని జనార్ధన్‌రావును హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొంది.

- Advertisement -

ఇక ఈ ఘటనలో జనార్థన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు నల్గొండ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఇక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రఘుబాబు బయటకువచ్చాడు.

- Advertisement -

జనార్థన్‌రావు సొంతూరు నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఘటన తర్వాత స్థానికులు నటుడు రఘుబాబుతో మాట్లాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.  ఇక నటుడిగా రఘుబాబుకు మంచి పేరు ఉంది. ఈ ఘటనతో ఆయన కెరీర్ అగమ్యగోచరంగా మారిందని వినికిడి. మరి ముందు ముందు రఘుబాబు మీడియా ముందుకు వస్తాడో .. రాడో తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News