Big Stories

Anushka Shetty : అనుష్కను చెక్కుతున్న గ్రాఫిక్ ఇంజనీర్స్… శెట్టి రిలీజ్ ఆలస్యం…

- Advertisement -

Anushka Shetty : జోరో సైజ్ సినిమా కోసం బొద్దుగా తయారైన బొమ్మాళి.. అప్పటి నుంచి అలాగే ఫిక్స్‌డ్‌గా ఉండిపోయింది. ఎంత వర్కౌట్ చేసినా లావు మాత్రం తగ్గడం లేదు. అందుకే, ఎలాగూ అనుష్క లావు తగ్గడం లేదు కాబట్టి.. ఆ కష్టం ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నీషియన్సే పడుతున్నారు. స్క్రీన్‌పై అనుష్క కాస్త నాజూగ్గా కనిపించేందుకు తెగ కష్టపడిపోతున్నారు.

- Advertisement -

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా మే 26న విడుదల కావాల్సి ఉంది. అయితే, అనుష్క గురించే సినిమా విడుదల ఆలస్యం అవుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లో అనుష్కను కాస్త లావు తగ్గించి చూపించడం కోసం సీజీ వర్కర్లు బాగా కష్టపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ వర్క్ కంప్లీట్ అయ్యేలా లేదట. అందుకే, ఈ సినిమాను ఈ నెలాఖరున విడుదల చేయడం కష్టం అంటున్నారు.

మే 26 మిస్ అయితే.. మళ్లీ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఆ విషయంలోనే కాస్త క్లాష్ వస్తోంది. మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఆదిపురుష్ సినిమాను కూడా తెలుగులో రలీజ్ చేస్తున్నది యూవీ క్రియేషన్సే. పైగా జూన్‌లోనేరిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమాను వచ్చే నెల రిలీజ్ చేయడం కష్టం అంటున్నారు. పోనీ, జులైలో విడుదలకు లైన్ క్లియర్‌గా ఉన్నప్పటికీ.. అది సినిమాలు రిలీజ్ చేసే సీజన్ కాదు. సో, ఆగస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అటు ఆగస్టులో చిరంజీవి, జైలర్, డీజే టిల్లు స్క్వేర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీని తట్టుకుని మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా నిలబడుతుందా అంటే.. ఇప్పుడే చెప్పడం కష్టం. సో, మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. అనుష్క లావు తగ్గకపోవడం సినిమా రిలీజ్‌పై ఎఫెక్ట్ పడింది. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News