Jr Ntr Sai Dharam Tej : మెగా క్యాంప్కి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది బైక్ యాక్సిడెంట్కు గురైన తర్వాత చానాళ్లను పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు చేయటంలో స్పీడు చూపిస్తున్నారు. ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్లో సాయి ధరమ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతుంది. కాగా.. డిసెంబర్ 7న ఈ సినిమా టైటిల్ను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా టైటిల్ రిలీజ్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. క్రికెట్ టీమ్లాంటి మెగా క్యాంప్ను కాదని సాయితేజ్.. ఎన్టీఆర్ను చీఫ్ గెస్ట్గా పిలిచుకోవటం ఏంటనే టాక్ కూడా లేకపోలేదు.
సాయిధరమ్ తేజ్ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ బ్యానర్లోనే వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మూవీకి కూడా భోగవల్లి ప్రసాద్ నిర్మాత. అలాగే తన 16వ సినిమాను కూడా సాయి ధరమ్ తేజ్ ఇదే బ్యానర్లో చేస్తున్నారు. దీన్ని కూడా కొత్త దర్శకుడే తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్గానే సినిమా సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనుంది.