Xiaomi Pad 9: ఈ ఏడాది మార్చి నెలలో షావోమీ ప్యాడ్ 8 భారత్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 9,200mAh బ్యాటరీతో వచ్చిన ఈ టాబ్లెట్కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా Xiaomi Pad 9 మార్కెట్లోకి రానుంది. చైనాలోని 3C సర్టిఫికేషన్ వెబ్సైట్లో ఈ కొత్త టాబ్లెట్ కనిపించడంతో త్వరలోనే ఇది విడుదల కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
చైనా సర్టిఫికేషన్ సైట్లో M656BA అనే మోడల్ నెంబర్తో సరికొత్త షావోమీ టాబ్లెట్ నమోదైంది. ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది Xiaomi Pad 9 కావచ్చు. ఈ లిస్టింగ్ ద్వారా ఈ ప్యాడ్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుందని స్పష్టమవుతోంది.
ఈ ఏడాది చివర్లో రాబోయే కొత్త Xiaomi 18 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు ఈ Xiaomi Pad 9 కూడా చైనాలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిరీస్లో ప్రామాణిక మోడల్తో పాటు మరింత మెరుగైన పనితీరు అందించేలా Xiaomi Pad 9 Pro వెర్షన్ను కూడా కంపెనీ తీసుకురానుంది. అయితే వీటిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!
పాత మోడల్తో పోలిస్తే.. కొత్త ప్యాడ్ 9లో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి. ప్యాడ్ 8లో ఉన్న 9,200mAh బ్యాటరీ కంటే పెద్దదైన 9,720mAh బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్తో ఇది రానుంది.
రూ. 33,999 ప్రారంభ ధరతో విడుదలైన Xiaomi Pad 8లో 11.2 అంగుళాల 3.2K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇప్పుడు రాబోతున్న Xiaomi Pad 9 అంతకంటే మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని యూజర్లు ఆశిస్తున్నారు.
Also Read: అమెజాన్లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?