Raj Tarun Lavanya case news(Today tollywood news): రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్తో పాటు.. తన దగ్గర ఉన్న ఆధారాలను పోలీసులకిచ్చారు. దీంతో రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాము పదేళ్లుగా కలిసే ఉన్నామనీ.. రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా ఆడియోలు రికార్డ్ చేశాడనీ లావణ్య ఆరోపిస్తున్నారు. మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఉదయం లావణ్యపై మాల్వీ మల్హోత్రా ఫిలింనగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. తన సోదరుడిని బెదిరిస్తుందని ఆరోపించారు.
Also Read : బిగ్ ట్విస్ట్, రాజ్తరుణ్ లవర్పై మాల్వీ ఫిర్యాదు
మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే లావణ్య నార్సింగ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్లు చేయించాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 170 ఫొటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్సులను, మెడికల్ రిపోర్టులను లావణ్య పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ పై పోలీసులు ఐపీసీ 493 సెక్షన్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు లావణ్య చేస్తున్న ఆరోపణలతో తనకేం సంబంధం లేదన్న రాజ్ తరుణ్.. తాజాగా తనపై నమోదైన కేసు విషయంలో ఏం సమాధానం చెబుతాడన్నది ఆసక్తిగా మారింది.
రాజ్ తరుణ్, లావణ్య కేసులో కొత్త ట్విస్ట్
రాజ్ తరుణ్ అబార్షన్ చేయించడని ఫిర్యాదు చేసిన లావణ్య.
నార్సింగి పోలీసులకు 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ అందించిన లావణ్య.
రాజ్ తరుణ్పై ఐపీసీ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.
పదేళ్లుగా తనతో కాపురం… https://t.co/UGd0KLYG7H— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2024