E-Paper
Advertisement

Manchu Manoj: మిస్ అవుతున్నా నాన్న… ఉండలేకపోతున్నా… మంచు మనోజ్ ఎమోషనల్..!

Manchu Manoj: మిస్ అవుతున్నా నాన్న… ఉండలేకపోతున్నా… మంచు మనోజ్ ఎమోషనల్..!

Manchu Manoj:విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్న మంచు మోహన్ బాబు (Manchu Mohan babu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత 4 నెలలుగా మంచు కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి.. ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో.. నాన్న నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మంచు మనోజ్.. చిన్నప్పుడు తన తండ్రి ఫోటోకి ముద్దాడుతున్న ఫోటోని జోడిస్తూనే.. మరొకవైపు తన తండ్రి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేస్తూ ఇలా రాసుకోచ్చారు.. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఈ వేడుకలో ఈ రోజున మేము మీ పక్కన ఉండడాన్ని కోల్పోతున్నాము.. మీ చుట్టూ ఉండి కూడా నేను ఈ వేడుకల్లో పాల్గొనలేకపోతున్నాను. ప్రతి విషయంలో కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న” అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

ఆస్తుల వల్లే మంచు కుటుంబంలో విభేదాలు..

ఇదిలా ఉండగా గత నాలుగు నెలల క్రితం జల్పల్లిలో వున్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో తండ్రితోపాటు కలిసి నివసిస్తున్న మంచు మనోజ్ సడన్గా ఒక రోజు గాయాలతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, దానిని వ్యతిరేకించబోతే తన తండ్రి తరఫు రౌడీలు తనపై దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు రాత్రి సమయంలో మంచు మోహన్ బాబు కూడా తన కొడుకు మంచు మనోజ్ కోడలు భూమా మౌనిక వల్ల ప్రాణహాని ఉంది అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా పరస్పరం కంప్లైంట్ ఇవ్వడంతో ఆస్తి కోసమే గొడవలు జరిగాయని అందరూ అనుకున్నారు.

జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి..

అయితే అలా గొడవలు జరుగుతున్న సమయంలో ఒకరోజు మంచు మనోజ్ డిఎస్పి, డీజీలను కలిసి మోహన్ బాబు ఇంటికి వస్తుండగా ..ఆయన ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ వీరిని లోపలికి అనుమతించలేదు. దాంతో గేట్లు బద్దలు కొట్టుకొని మరీ మనోజ్ లోపలికి వెళ్లిపోవడంతో..ఆ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు మోహన్ బాబును ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆయన జర్నలిస్టులపై దాడి చేయగా వారు ఈయనపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఈ విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కారు మోహన్ బాబు. ఇక తర్వాత సంక్రాంతి సందర్భంగా తిరుపతి లో గొడవలు జరిగిన విషయం తెలిసిందే.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×