E-Paper
Advertisement

Prabhas: ప్రభాస్‌ను హత్తుకుని ఏడ్చేసిన రాజేంద్ర ప్రసాద్

Prabhas: ప్రభాస్‌ను హత్తుకుని ఏడ్చేసిన రాజేంద్ర ప్రసాద్

Prabhas.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు (Krishnam Raju) వారసుడిగా అడుగుపెట్టి నేడు రెబల్ స్టార్ గా, పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhash) హీరో గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఎంత సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా సరే తన కోసం వచ్చిన వారిని అలాగే తనకు కావలసిన వారి కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారనటంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవలే పుత్రికాశోకంతో విలవిలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ పరామర్శించడానికి ప్రభాస్ నేరుగా ఆయన ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం.

అకాల మృత్యువాతపడ్డ రాజేంద్రప్రసాద్ కుమార్తె..

అసలు విషయంలోకెళితే.. అక్టోబర్ ఆరవ తేదీన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఛాతీ లో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చేర్పించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె మరణించారు. ఆ సమయంలో కుమారుడు బాలాజీ, రాజేంద్రప్రసాద్ దంపతులు మాత్రమే ఉన్నారు. గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రైవేట్ ఉద్యోగి రాజ్ కుమార్ తో వివాహం జరిపించగా.. వారికి ఒక ఒక కుమార్తె సాయి తేజస్వి కూడా ఉంది. ఇకపోతే గాయత్రి మరణం అటు సినీ సెలబ్రిటీలను, ఇటు అభిమానులను వారి కుటుంబాన్ని పూర్తిగా దిగ్బ్రాంతికి గురిచేసింది.

ఇకపోతే శనివారం ఉదయం కేపీహెచ్బీ ఏడో ఫేజ్ లోని ఇందు విలాస్ లో రాజేంద్రప్రసాద్ నివాసానికి గాయత్రి భౌతిక కాయాన్ని తరలించగా.. చిరంజీవి , అల్లు అర్జున్, వెంకటేష్, త్రివిక్రమ్, సాయికుమార్, బ్రహ్మానందం, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు విచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. ఇకపోతే గాయత్రి అంత్యక్రియలు కేపిహెచ్బి లోని కైలాస వాసంలో ఆదివారం నిర్వహించిన విషయం తెలిసిందే.

రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన ప్రభాస్..

ఇకపోతే కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు రాజేంద్రప్రసాద్. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆయనను స్వయంగా కలుస్తూ పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి గాయత్రీ మరణం పై ఆయనను పరామర్శించబోతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా ఆయన రాజేంద్ర ప్రసాద్ ను కలిసి పరామర్శించారు. గాయత్రి మరణం తనను మానసికంగా మరింత కలచివేసిందని బాధపడ్డారు ప్రభాస్. ఇక ప్రభాస్ గాయత్రి ఫోటో దగ్గర పూలు ఉంచి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.. అనంతరం రాజేంద్రప్రసాద్ తో మాట్లాడుతూ.. ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం చూసి ప్రభాస్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతూ రాజు ఎక్కడైనా రాజే.. మంచి మనసున్న మారాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×