E-Paper
Advertisement

CM Chandrababu: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

CM Chandrababu: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

CM Chandrababu Visited Vijayawada Kanaka Durga Temple: దసరా ఉత్సవాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. అనంతరం కనకదుర్గా దేవీకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పండితులు, ఆలయ అధికారులు భారీగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. చంద్రబాబు వెంట మంత్రి లోకేశ్ దంపతులు కూడా ఉన్నారు.

Also Read: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తిరుమల తిరుపతి తరువాత ఇంద్రకీలాద్రి రెండో అతిపెద్ద దేవాలయమని అన్నారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు, దుర్గమ్మ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే.. మూలా నక్షత్రం రోజు దుర్గమ్మను దర్శించుకోవడం నా అదృష్టం. లక్షల సంఖ్యలో భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రీ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారందరికీ మంచి జరిగేలా చూడాలని, మేం చేస్తున్న మంచి పనులను ఆశీర్వదించాలను దుర్గమ్మను వేడుకున్నాను.

ఈసారి ఇక్కడ సేవా కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ద్వారా అనేక రకాల సేవలను భక్తులకు అందిస్తున్నాం. దుర్గగుడి పాలక మండలి సభ్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎంతగానో శ్రమించారు.

Also Read:  కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్‌కు టీడీపీ ఝలక్

ఇంద్రకీలాద్రీపై వీఐపీ భక్తులు కూడా సహకరిస్తున్నారు. వారంతా కూడా దుర్గగుడి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశంసలు తెలియజేస్తున్నారు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే మా ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటాయి. రాష్ట్రంలో ప్రతి దేవాలయానికి పూర్వ వైభం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను. ఈసారి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అది కేవలం దుర్గమ్మ దేవత దయవల్లే. అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తివ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకుంటున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×