E-Paper
Advertisement

Manjummel Boys: హిట్ సినిమాకు తెలుగులో చిక్కులు.. మైత్రీ ఫైర్

Manjummel Boys: హిట్ సినిమాకు తెలుగులో చిక్కులు.. మైత్రీ ఫైర్

Manjummel Boys: ఈ మధ్యకాలంలో మలయాళ హిట్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతునం విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రేమలు తెలుగులో రిలీజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యనే మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కన్నా మంజుమ్మల్ బాయ్స్ నే ఎక్కువ కలక్షన్స్ రాబట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ లోపే ఈ సినిమా చిక్కుల్లో పడింది. అనూహ్యాంగా పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. ఇక తమ సినిమాను చెప్పాపెట్టకుండా థియేటర్ లో నిలిపివేయడంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యాడు.

మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని, మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమని ఆయన తెలిపారు. అంతేకాకుండా షోస్ ను ఆపడం వలన తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×