BigTV English
Advertisement

India Monsoon Report: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!

India Monsoon Report: చల్లని కబురు చెప్పిన IMD.. ఈసారి ముందుగానే రుతుపవనాలు.. ఫుల్లుగా వర్షాలు!

Early Monsoon with More Rain to India Says IMD: భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సంవృద్ధిగా వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి.. లా నినా పరిస్థితులు కారణంగా రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో కర్ణాకట రాష్ట్రంలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా నీటి ఎద్దడి నెలకొంది. ఈ తరుణంలో రాబోయే వర్షా కాలంలో వర్షాలు కురుస్తాయా..? లేదా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది.

జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడితే గతేడాది కంటే ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే విధంగా బలమైన రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


హిందూ మహాసముద్రంలో ద్విధ్రువ పరిస్థితులతో పాటుగా లా నినా పరిస్థితులు ఏకకాలంలో యాక్టివ్ అవ్వడంతో రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు అల్పపీడనాలు పశ్చిమ, వాయువ్య భారతదేశం, ఉత్తర అరేబియా సముద్రం మీదుగా విస్తరించి ఉంటాయని తెలిపింది.

Also Read: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

దీంతో సముద్రమట్టాలు కూడా పెరుగుతాయని వెల్లడించింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుందని.. దీంతో దేశంలో సాధారణ వర్షానికి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×