Ram charan Upasana news(Tollywood news in telugu): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ను ఫినిష్ చేసి రిలాక్స్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ రిలాక్స్ మోడ్ ను క్లింకారతో టైమ్ గడపడానికి ఉపయోగిస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. నేడు రామ్ చరణ్ దంపతులు ముంబైకి పయనమయ్యారు. ప్రస్తుతం ముంబై జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహం జరుగుతున్న విషయం తెల్సిందే.
జూలై మొదటి వారం నుంచే ఈ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సంగీత్, హల్దీ, పూజ అంటూ రోజుకో పండగ జరుగుతుంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు ఇప్పటికే పెళ్లిలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ జంట వివాహానికి హాజరుకావడానికి చరణ్ దంపతులు ముంబైకి బయల్దేరారు. నేటి ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చరణ్, ఉపాసన, క్లింకార కెమెరా కంటికి చిక్కారు.
ఇక అంబానీ పెళ్ళికి వెళ్తున్న ఏకైక తెలుగు హీరో చరణ్ మాత్రమే కావడం విశేషం. అనంత్- రాధికా ఎంగేజ్ మెంట్ లో కూడా చరణ్ మెరిశాడు. మెరవడం మాత్రమే కాదు హైలైట్ గా నిలిచాడు. ఆర్ఆర్ఆర్ సాంగ్ కు నీతూ అంబానీ స్టేజిమీదకు పిలిచి మరీ స్టెప్పులు వేయించింది. ఇక పెళ్ళిలో కూడా చరణ్ హడావిడి అలానే ఉండబోతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్, ఉపాసన ఎయిర్ పోర్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చరణ్.. త్వరలోనే RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. మరి ఈ సినిమా లతో చరణ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.