Allu Arjun and Trivikram movie updates(Today tollywood news) : పాన్ ఇండియా క్రెడిట్ కేవలం హీరోలకే దక్కాలా. పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోకూడదా. ఇదే ప్లాన్లో ఉన్నట్టున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఆల్రడీ రాజమౌళి ఈ లిస్టులో ఉన్నాడు. సుకుమార్ నెక్ట్స్ ప్లేస్లోకి వచ్చేశాడు. ఇక త్రివిక్రమ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నిజానికి త్రివిక్రమ్ సినిమాలు కోలీవుడ్, బాలీవుడ్ను బాగానే ఇంప్రెస్ చేశాయి. కాకపోతే, ఈ సినిమాల్లోని సోల్ను పట్టుకోలేక సినిమాను చెడగొట్టేశారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాలను కోలీవుడ్, బాలీవుడ్లో రీమేక్ చేస్తే అవి కాస్తా డిజాస్టర్ అయ్యాయి. మెయిన్గా తెలుగులో ఉండే ఈ ఫీల్ను రాబట్టలేకపోయారు. అందుకే, ఈసారి రీమేక్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా.. డైరెక్టుగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేద్దామనుకుంటున్నాడు
పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలనుకుంటే సరిపోదు. హీరో కూడా ఉండాలి. ఆల్రడీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. వీరిలో త్రివిక్రమ్కు కంఫర్ట్గా ఉండేది అల్లు అర్జున్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్గా వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతకు ముందు వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయ్ సినిమాలు కూడా ఓ రేంజ్ హిట్స్. ఇప్పుడు నాలుగోసారి కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అటు త్రివిక్రమ్ కూడా మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నాడు. వచ్చే సంక్రాంతి వరకు ఈ సినిమాతోనే బిజీగా ఉంటాడు త్రివిక్రమ్. ఎలాగూ అల్లు అర్జున్ కూడా అందుబాటులో ఉండడు కాబట్టి.. ఈ ఇద్దరూ వచ్చే ఏడాదే సినిమా గురించి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. కాకపోతే, ఈ ఇద్దరి కాంబినేషన్ మాత్రం పక్కా అంటున్నారు.