E-Paper
Advertisement

Aksathamurthys : ఏడాదికి 100 కోట్లు.. అక్షతామూర్తి ఆదాయం అదుర్స్..

Aksathamurthys : ఏడాదికి 100 కోట్లు.. అక్షతామూర్తి ఆదాయం అదుర్స్..
Advertisement

Aksathamurthys : అక్షతామూర్తి. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సతీమణి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు. తండ్రి నుంచి వారసత్వంగా ఇన్ఫీ షేర్ల రూపంలో భారీగా సంపద వచ్చిపడింది. ఎంత అంటే.. ఏడాదికి ఏకంగా 100 కోట్లకు పైగా డివిడెంట్ వచ్చేంత.

అవును, మీరు చదివింది నిజమే. ఏడాదికి అక్షరాలా వంద కోట్లకు పైగా ఆదాయం ఆమెకు వస్తోంది. 2022లో ఆమెకు 126 కోట్ల డివిడెండ్ రాగా.. అంతకు ముందు 2021లో 120 కోట్ల ఆదాయం వచ్చిపడింది. అదంతా ఇన్ఫోసిస్ షేర్ల నుంచే.

Advertisement

అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల (0.93 శాతం) షేర్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలుప ప్రకారం.. ఆ వాటా విలువ సుమారు 6వేల కోట్లు. ఈ ఏడాది ఒక్కో షేరుపై రూ.32.5 చొప్పున డివిడెంట్ ఇచ్చింది ఇన్ఫీ. ఆ లెక్కన అక్షతకు ఉన్న 3.89 కోట్ల షేర్లకు గాను.. ఈ ఏడాదికి మొత్తం 126.61 కోట్ల ఆదాయం లభించింది. 2021లో షేరుకు రూ.30 డివిడెండ్‌ ఇవ్వగా.. ఆమెకు రూ.119.5 కోట్ల ఇన్ కమ్ వచ్చింది.

ఇండియన్ సిటిజన్ గానే బ్రిటన్ లో ఉంటున్న అక్షతామూర్తి.. బ్రిటన్ లో నాన్-డొమిసైల్ హోదాలో పన్ను రాయితీ పొందేవారు. అంటే, వారు విదేశాల్లో సంపాదించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టనక్కరలేదు. ఇది చట్టబద్ధ పన్ను రాయితీనే. అయినా, ప్రతిపక్షం ఇటీవల ఈ విషయంలో రిషి సునాక్ ను బాగా కార్నర్ చేయడంతో.. అక్షతామూర్తి నాన్-డొమిసైల్ హోదాని వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్జిస్తున్న ఆదాయంపై ఇకపై బ్రిటన్‌లోనూ పన్ను చెల్లిస్తానని ప్రకటించారు. అంటే, ఈ ఏడాదికి వచ్చిన 126 కోట్లకు గాను అక్షత బ్రిటన్ లోనూ పన్ను కట్టనున్నారు.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×