E-Paper
Advertisement

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!
Advertisement

Hindu Temple: పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 125 సంవత్సరాల నాటి పురాతన హిందూ ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సమీపంలో ఉన్న ఒక మదర్సా విస్తరణ కోసమే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానిక హిందువులు, మైనారిటీ సంఘాలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే?

లాహోర్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉండేది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆగస్టు 21న ‘తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్’ (TLP) అనే నిషేధిత తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న ఇస్లామిక్ పాఠశాల విస్తరణలో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని వారు పేర్కొన్నారు. కూల్చివేత అనంతరం ఆలయ శిఖరానికి ఉన్న లోహపు భాగాలు, ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుండి మాయం చేశారని తెలిపారు.

అధికారుల వైఫల్యంపై ఆగ్రహం

Advertisement

ఈ ఘటనను స్థానిక రాజకీయ పార్టీ పాకిస్తాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ పార్టీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక యంత్రాగానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆలయానికి చెందిన భూమిని గతంలో ‘ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ (ETPB) మదర్సా కోసం లీజుకు ఇచ్చిందని, అయితే అద్దె చెల్లించకపోవడంతో జనవరి 29నే ఆ లీజును రద్దు చేస్తూ ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్లే ఈ కూల్చివేత జరిగిందని ఆరోపించారు.

బిక్కుబిక్కుమంటోన్న హిందూ కమిటీ

మరోవైపు అక్కడి హిందూ సంఘం నేత రతన్ లాల్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఈటీపీబీ ఆలయాన్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉన్న మదర్సా వల్ల.. స్థానిక హిందూ కమిటీ సభ్యులు ఆ స్థలాన్ని సందర్శించడానికి కూడా భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

వర్షాల వల్లే కూలిందన్న ప్రభుత్వం

అయితే హిందూ సంఘాల ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారీ వర్షాల కారణంగానే ఈ పాత భవనం కూలిపోయిందని ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తికార్ తెలిపారు. ఆలయ భూమిని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఆలయ భద్రతపై ముప్పు ఉందనే విషయం స్థానిక పోలీసులకు ముందుగానే తెలుసని ఆయన పేర్కొన్నారు. అటు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఈటీపీబీ తెలిపింది.

Also Read: BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

Tags

Related News

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×