E-Paper
Advertisement

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!
Advertisement

Nepal Floods: హిమాలయాల్లో సంభవించిన హిమపాతం, దానివెంట వచ్చిన అకస్మిక వరదలు నేపాల్, చైనాను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నేపాల్లో ఈ విపత్తు ప్రభావం అధికంగా ఉంది. ఈ జల ప్రళయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకి కోసం నేపాల్ పోలీసులు గాలిస్తుండగా.. విషాధకర పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. వరద ధాటికి కొట్టుకుపోయిన ఓ ఇంటి నుంచి ఏకంగా 24 మృతదేహాలను తాజాగా రెస్క్యూ బృందం వెలికి తీసింది.

వివరాల్లోకి వెళ్తే..

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా బెత్రవతి ప్రాంతంలో ఈ అత్యంత విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. వరద ధాటికి కొట్టుకుపోయిన ఓ భవనం నుంచి రెస్క్యూ బృందాలు ఏకంగా 24 మృతదేహాలను వెలికితీశాయి. ‘ఉత్తరగాయ మినీ మార్ట్’ (Uttargaya Mini Mart) నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఈ శవాలన్నీ లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోస్ట్ మార్టంకు తరలింపు

Advertisement

అయితే భవనంలో దొరికిన మృతదేహాలను గుర్తించే పనిలో నేపాల్ పోలీసులు పడ్డారు. చట్టపరమైన ప్రక్రియలు కొనసాగిస్తూ మృతుల వివరాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ మార్ట్ నిమిత్తం మృతదేహాలను మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ విశ్వవిద్యాలయ టీచింగ్ ఆసుపత్రికి తరలించనున్నట్లు నువాకోట్ జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

1000 దాటిన మరణాలు

నేపాల్, చైనాలను ఒకేసారి ముంచెత్తిన ఈ విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. దాదాపు 4,400 మందికి పైగా ఆచూకీ లభించకుండా పోయారు. ఒక్క నేపాల్‌లోనే ఇప్పటివరకు 987 మంది ప్రాణాలు కోల్పోగా 583 మంది విదేశీయులతో సహా 3,916 మంది గల్లంతైనట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) ప్రకటించింది. ఇక చైనాలో 16 మంది మృతి చెందగా 261 మంది విదేశీయులు సహా 546 మంది జాడ తెలియకుండా పోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

హిమపాతమే విపత్తుకు కారణం

ఆగస్టు 26న హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతంలో చోటుచేసుకున్న హిమపాతమే ఈ జల ప్రళయానికి దారితీసింది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద చోటుచేసుకున్న ఘటనే కారణమని తెలుస్తోంది. అక్కడ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగి దాదాపు 1,200 మీటర్ల కిందకు పడటంతో లెండే నది ఉప్పొంగింది. నదీ ప్రవాహంతో పాటు మంచు, రాళ్లు, బురద విపరీతమైన వేగంతో కొట్టుకొచ్చి గ్రామాలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేశాయి.

Also Read: తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

Tags

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×