BigTV English
Advertisement

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
nepal bus accident
nepal bus accident

7 Killed in Nepal Bus Accident : నేపాల్ బాగ్మతి ప్రావిన్స్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. ఘట్ బేసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మహిళ సహా కనీసం ఏడుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన పోలీసులు, నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


గాయపడిన వారిని రెస్క్యూ చేసి.. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం ఖాట్మండుకు తరలించినట్లు ఎస్పీ గౌతమ్ తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బస్సులో నదిలో పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×