E-Paper
Advertisement

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి

Nepal Bus Accident : నదిలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
nepal bus accident
nepal bus accident

7 Killed in Nepal Bus Accident : నేపాల్ బాగ్మతి ప్రావిన్స్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక మహిళ సహా ఏడుగురు మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. ఘట్ బేసి నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ప్యాసింజర్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. బస్సు త్రిశూలి నదిలో పడిపోయింది. ధాడింగ్ జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గౌతమ్ కెసి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మహిళ సహా కనీసం ఏడుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన పోలీసులు, నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని రెస్క్యూ చేసి.. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేశారు. అనంతరం ఖాట్మండుకు తరలించినట్లు ఎస్పీ గౌతమ్ తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బస్సులో నదిలో పడి ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×