Bangladesh News: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వల్ల కొరైల్ మురికివాడలో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు 1,500 గుడిసెలు మంటలకు ఆహుతి అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగింది?
ఢాకాలోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం
హాంకాంగ్.. ఆ తర్వాత బంగ్లాదేశ్.. ఇలా వేర్వేరు దేశాల్లో భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతి పెద్ద కొరైల్ స్లమ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 1,500 గుడిసెలు కాలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఢాకాలోని మురికివాడ ప్రాంతాల్లో కోరైల్ అది పెద్దది. ఈ ప్రాంతంలో వేలాది మంది చిన్నచిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం వేళ కావడంతో అందరూ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
మంటల్లో 1500 ఇళ్లు, తప్పిన ప్రాణాపాయం
ఆ తర్వాత మంటలు స్లమ్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాదాపు 1500 పూరిళ్లు తగలబడ్డాయి. అందులో నివసించే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 16 గంటల తర్వాత మంటలను గురువారం ఉదయం నాటికి అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి రషెద్ బిన్ ఖలీద్ తెలిపారు. ఇరుకైన సందుల కారణంగా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఇబ్బంది పడ్డామని తెలిపారు.
అధికారిక సమాచారం మేరకు.. 160 ఎకరాల్లో 60 వేల కుటుంబాలు ఉంటున్నాయి. అందులో శరణార్థులుగా వచ్చినవారు ఉన్నారు. అందులోని ఎక్కువ మంది మురికివాడలో నివసిస్తున్నాయి. సాయంత్రం వేళ మంటలు నివాసాలను చుట్టుముట్టడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇళ్ళు కోల్పోయిన నివాసితులు.. మంటలకు కాలిపోయిన ఇళ్లు, తమ వస్తువులను సేకరించడానికి ప్రయత్నించారు.
ALSO READ: వైట్హౌస్ సమీపంలో కాల్పులు.. ఉలిక్కిపడిన అమెరికా
2024 నాటి లెక్కల ప్రకారం.. 10.2 మిలియన్ల జనాభా కలిగిన ఢాకాలో వేలాది మంది మురికివాడలో ఉంటున్నారు. పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధానికి వారంతా వలస వచ్చారు. రిక్షాలు, ఆటోలు నడపడం, ఇంటి పని మనిషులు, క్లీనర్గా ఇలా రకరకాల పనులపై వారంతా ఆధారపడి జీవిస్తారు.
ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం.. 1500 ఇళ్లు దగ్ధం..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం
ఈ ఘటన కారణంగా కొరైల్ మురికివాడలో వేల మంది నిరాశ్రయులు
మురికివాడలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 1,500 గుడిసెలు మంటలకు ఆహుతి
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం pic.twitter.com/ki40smbT9W
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2025