E-Paper
Advertisement

USA: బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించిన అమెరికా

USA: బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించిన అమెరికా
Advertisement

USA: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లపై ఇండియా.. ది మోదీ క్వశ్చన్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంటరీని ఇప్పటికే భారత ప్రభుత్వం ఖండించింది. ఆ డాక్యుమెంటరీలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని, చూసే వారిని తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు ఆరోపించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా దీనిపై స్పందిస్తూ.. అందులోని అంశాలను తాను పూర్తిగా అంగీకరించలేనని తెలిపారు.

ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. ‘‘ఈ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. భారత ప్రజాస్వామ్యం అత్యంత శక్తివంతమైనది. రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి’’ అని అన్నారు.

Advertisement

ఇటీవల దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్రచార కార్యక్రమం అని, వారు ఎంచుకున్న కోణాన్ని మాత్రమే ప్రచారం చేయడానికి దీన్ని రూపొందించారని అన్నారు. ఈ వ్యవహారంపై స్వతంత్య్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్‌లైన్ పిటిషన్ కూడా దాఖలైంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×